శ్రీరాంపూర్/మందమర్రి/రామకృష్ణాపూర్/సీసీసీ నస్పూర్/రెబ్బెన/తాండూర్, డిసెంబర్ 26: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగ నున్నది.
అదేరోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. మొ త్తం 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచా యి. 11 ఏరియాల పరిధిలో 39,827 మంది కార్మికులు ఓటు వేయనున్నారు.