హుజూరాబాద్: హుజూరాబాద్లో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. కొందరు మహిళలు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకుని ఓటేయడానికి వెళ్తున్నారు. గత కొన్నిరోజులుగా పెట్రోల్, డీజిల్తోపాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. తర్వలోనే సిండర్ బండ ధర రూ.వెయ్యికి చేరనున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరతో తాము మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లాల్సి వస్తున్నదని, బండ భారం తాము మోయలేమని సామాన్య ప్రజలు అంటున్నారు. ఈ ఎన్నికల ద్వారా పెరుగుతున్న ధరలపై కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలుపుతామంటున్నారు.