V Prakash | హైదరాబాద్ : త్వరలో రాజకీయ మార్చురీకి పోయేది రేవంత్ రెడ్డి మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ అన్నారు. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. ఏడాది కాలం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా.. తన హోదాను మరిచి వీధి రౌడీలా అసభ్య పదజాలంతో దూషించినా.. కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సహిస్తున్నారంటే అది ఆయన బలహీనత కాదు.. ఆయన రాజకీయ పరిపక్వత, హుందాతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
శిశుపాలుని వందతప్పులు లెక్కించిన తర్వాతే కృష్ణుని చేతిలో కుక్క చావు చచ్చాడు. తెలంగాణ ప్రజలు ఓ అసమర్థునికి పట్టం కట్టారు. పిచ్చి కూతలు కూస్తే ప్రజలు ఊరుకోరు అని ప్రకాశ్ స్పష్టం చేశారు.
రవీంద్రభారతిలో రేవంత్ మాట్లాడుతూ తన దగ్గర డబ్బులు లేవని చెప్పడం ఆయన చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్ తన పదేండ్ల పాలనలో ఏ రాష్ట్రంలో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికీ సాధ్యపడని ఆర్ధిక ప్రగతిని సాధించి తెలంగాణ ఆదాయాన్ని మూడు రెట్లు పెంచారు. ఆ ప్రగతిని గమనించే వేలాది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు. రేవంత్ గత పదిహేను నెలల పాలనలో తెలంగాణను పదేండ్లు వెనక్కి నెట్టారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని తన అపరిపక్వత కారణంగా దిగజార్చి కేసీఆర్పైన నెపాన్ని మోపి తప్పించుకోవాలనుకుంటున్నాడు. చేతకాని ముఖ్యమంత్రులను గద్దె దించడమే ఇప్పటివరకూ చూసాం కానీ నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రిని పిచ్చి కుక్కలా తరిమే రోజు ఇంకెంతో దూరం లేదు అని వీ ప్రకాశ్ పేర్కొన్నారు.