Gaddam Vivek | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కంపెనీ నుంచి మ్యాన్పవర్ కంపెనీకి బదిలీ అయిన రూ.8 కోట్ల నగదును అధికారులు ఫ్రీజ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో నగదు రవాణాతోపాటు బ్యాంకు భారీ లావాదేవీలపై కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బయటకొస్తున్నాయి.
ఈ నెల 13వ తేదీ ఉదయం 10.57 నిమిషాల ప్రాంతంలో బేగంపేటలోని హెచ్డీఎఫ్సీ బ్రాంచ్లోని విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఒక ఖాతా నుంచి బషీర్బాగ్లోని ఐడీబీఐ బ్యాంకుశాఖలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలోకి (ఖాతా నంబర్ 0142003072600) రూ.8 కోట్ల నగదు బదిలీ అయినట్టు ఈసీ అధికారులు సమాచారం అందించింది.
చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆదేశాలతో సైఫాబాద్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఆ ఖాతాలో జమైన అనుమానాస్పద రూ.8 కోట్ల నగదును ఫ్రీజ్ చేయాలని బ్యాంకు మేనేజర్కు ఈసీ అధికారులు లేఖ రాశారు. దాంతో బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందినదిగా భావిస్తున్న రూ.7.5 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.