సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నల్లమందు సరఫరా చేస్తున్న ఒక ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దేవేందర్ కాసినియా, తేజారామ్ కొంతకాలంగా నల్లమందు తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న డీటీఎఫ్ అధికారులు ధూల్పేట, నారాయణగూడ స్టేషన్ల పరిధిలోని నిందితుల ఇండ్లపై ఈ నెల 19న రాత్రి దాడులు నిర్వహించారు.
రూ.1.50 కోట్ల విలువైన 160 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి విజయ్ ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ శిరీష, సావిత్రి, సౌజన్య, ఎస్హెచ్వోలు మధుబాబు, రామకృష్ణ పాల్గొన్నారు. వీరిని మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.