మారేడ్పల్లి, మే 14: సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లో శనివారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రైవేటు కంపెనీ డీజీఎం ఇంట్లో రూ.1.65 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో భారీగా నగదు ఉండటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభిజిత్ ఎలక్ట్రికల్స్ అనే ట్రాన్స్ఫార్మర్ల ఉత్పత్తి కంపెనీలో డీజీఎంగా పనిచేసే భైరి శ్రీనివాస్ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో స్వ ల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కుటుంబసభ్యులందరూ విశాఖపట్నంలో ఉన్నారు.
స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. పనికిరాని వస్తువులు, చెక్కలు, ఇతర సామగ్రి మం టల్లో కాలింది. ఆ ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉన్నదని గోపాలపురం పోలీసులకు సమాచారం అందింది. రాత్రి 12 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంట్లో స్థానికులు, బంధువుల సమక్షంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా, 1.65 కోట్ల నగదు లభించింది. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును, ఆభరణాలను పోలీస్స్టేషన్కు తరలించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. హవాలా మార్గంలో వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని, వచ్చాక చూపిస్తానని శ్రీనివాస్ తెలిపారు.