సూర్యాపేట: జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆగిఉన్న కారును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. గురువారం ఉదయం జాతీయ రహదారిపై నంబర్ లేకుండా రెండు వాహనాలు అనుమానాస్పదంగా వెళ్తున్నాయని సమాచారం అందిందని, దీంతో పెట్రోలింగ్ వాహనంలో బస్టాండ్ వద్దకు వెళ్లామని పోలీసులు తెలిపారు. వాహనాల గురించి విచారణ చేస్తుండగా దుండగులు కారును ఎత్తుకెళ్లారని చెప్పారు. కనిపించకుండా వాహనం కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.