వరంగల్ రూరల్ : పోలీసులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజల సేవకు అంకితం కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీసులకు పిలుపునిచ్చారు. గురువారం సంగెం పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. పోలీస్ కమిషనర్ ముందుగా ఈస్ట్ జోన్ డి.సి.పి వెంకటలక్ష్మి , మామూనూర్ ఎ.సి.పి నరేష్ కుమార్, పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషన్, ఎస్.ఐ సురేష్ తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సన్నిహిత కౌంటర్ పనితీరుపై సీపీ సంబంధిత సన్నిహిత కౌంటర్ ఇంచార్జిని వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు స్టేషన్ ఐటీ కోర్ విభాగం పనితీరుపై ఆరా తీసారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.