హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆరోగ్య భద్రత విభాగం కార్యదర్శి ఆల గోపాల్రెడ్డి (80) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నానక్రామ్ గూడలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్సపొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పోలీస్ శాఖలో సబ్ఇన్స్పెక్టర్గా చేరిన ఏ గోపాల్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా ఉద్యోగ విరమణ పొందారు.
అనంతరం 20 ఏండ్లుగా భద్రత, ఆరోగ్య భద్రత విభాగాల కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. గోపాల్ రెడ్డి మృతి పట్ల డీజీపీ శివధర్ రెడ్డి విచా(రం వ్యక్తంచేశారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి గోపాల్రెడ్డి అని అధికారుల సంఘం కొనియాడింది.