నిజామాబాద్ : జిల్లాలోని బోధన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంపైన ఆందోళనకు దిగిన ఇరు వర్గాలతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు పీస్ కమిటీ సమావేశం బోధన్ ఠాణాలో నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీస్ శాఖ కు సహకారం అందించాలని సీపీ కోరారు.