హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ కుట్రపన్నిన విషయంపై ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు దర్యాప్తు చేపట్టారు. సతీశ్శర్మ అలియాస్ రామచంద్ర భారతి అనే వ్యక్తి బీజేపీలోకి మారితే తనకు రూ.100 కోట్లు ఇప్పిస్తానని ఆఫర్ చేశాడని రోహిత్రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. ఆ రూ.100 కోట్లలో రూ.50 కోట్లు అడ్వాన్స్గా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నందు అనే వ్యక్తి మధ్యవర్తిత్వంతో సతీశ్శర్మ, సింహయాజులు మొయినాబాద్ ఫామ్హౌస్కు వచ్చారని రోహిత్రెడ్డి చెప్పారు. రోహిత్రెడ్డిపై కేసులు లేకుండా చేస్తామని కూడా వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంట్రాక్టులతోపాటు ఉన్నత పదవులు ఇస్తామని కూడా ఆశచూపారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. మరికాసేపట్లో నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.