హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : 16వ అఖిల భారత పోలీసు బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్నకు రాష్ట్ర పోలీసు శాఖ అతిథ్యమిస్తోందని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ టోర్నమెంట్లో 24 జట్లు ఉంటాయని, 14 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 440 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 18 నుంచి 21 వరకు హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మొత్తం 745 మ్యాచ్లు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీలు అభిలాషా బిస్త్, సంజయ్ కుమార్జైన్, విజయ్కుమార్, విక్రమ్సింగ్ మాన్, స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, ఐజీపీ ఎం. రమేశ్, డీసీపీ శ్రీబాల తదితరులు హాజరయ్యారు.