హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో అడుగుపెట్టనున్న సీనియర్లలో బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్రెడ్డి (74), బోధన్ నుంచి విజయం సాధించిన పీ సుదర్శన్రెడ్డి (74) అందరికంటే ముం దున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి (71), ఖమ్మం నుంచి ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావు (70), గజ్వేల్ నుంచి గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (69), అందోల్ నుంచి విజయం సాధించిన దామోదర్ రాజనర్సింహ (64) ఉన్నారు.