హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీని(BRS party) వీడి పలువురు ఇతర పార్టీల్లో చేరడంపై మాజీ శాసన సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తా(Garbage) అంతా పోయింది. గట్టి వాళ్లు మాత్రమే మిగిలారని పేర్కొన్నారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చిన వారే పార్టీ మారుతున్నారని విమర్శించారు.
మోసకారుల జాబితా రాస్తే తొలిపేరు బీబీ పాటిల్దే ఉంటుందన్నారు. తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయని చెప్పారు. ఎవరు పార్టీని వీడిన వచ్చే నష్టం లేదన్నారు.