Statue Of Equality | ముచ్చింతల్లో సమాతమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత పంచమి వేళ రామానుజ విగ్రహావిష్కరణ సంతోషదాయకం అని పేర్కొన్నారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయన్నారు. సమతామూర్తి విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని పేర్కొన్నారు.
రామానుజాచార్యులు ముందు తరాలకు ప్రేరణగా నిలిచారు. 108 దివ్యదేశ మందిరాల ఏర్పాటు అద్భుతమని మోదీ ప్రశంసించారు. దేశమంతా తిరిగి ఆలయాలు చూసిన అనుభూతి కలిగింది. చిన్నజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారు. విష్వక్సేనేష్ఠి యజ్ఞం 130 కోట్ల ప్రజలకు అందాలన్నారు. మన దేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయి. రామానుజాచార్యుల విశిష్టాద్వైతం తమకు ప్రేరణ అని మోదీ పేర్కొన్నారు. రామానుజాచార్యుల బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదు. ఆయన అంధవిశ్వాసాలను పారదోలారు. భక్తికి కులం, మతం లేదని రామానుజాచార్యులు చాటి చప్పారు అని మోదీ పేర్కొన్నారు.