హైదరాబాద్ : గచ్చిబౌలిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాని మోదీ ప్రయాణానికి ఆటంకం కలిగినట్లు సమాచారం. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. హెలికాప్టర్ ప్రయాణానికి ఏటీసీ అధికారులు అనుమతించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గచ్చిబౌలి ఐఎస్బీ నుంచి హెచ్సీయూకు రోడ్డుమార్గాన ప్రధాని మోదీ బయల్దేరారు. అక్కడ్నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు హెలికాప్టర్లో బయల్దేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రధాని. ఐఎస్బీ 20వ వార్షికోత్సవ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే.