రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్
హైదరాబాద్, జూన్2 (నమస్తే తెలంగాణ): దేశ ప్రగతికి తెలంగాణ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ప్రజలు.. కృషికి, దేశప్రగతికి, అసమానమైన అంకితభావానికి పర్యాయ పదాలని అభివర్ణించారు. రాష్ట్ర సంస్కృతి ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, తెలంగాణ ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.