PM Modi | సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కింద ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Anguished by the loss of lives due to a fire tragedy at a factory in Sangareddy, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured…
— PMO India (@PMOIndia) June 30, 2025
సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఐదుగురు మరణించాగా, దవాఖానలో మరో ముగ్గురురు చనిపోయారు. మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న 50 నుంచి 60 మంది కార్ముకులను బయటకు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను ప్రైవేటు దవాఖానకు తరలించారు.
Also Read..
Harish Rao | సిగాచి ఫార్మా మృతులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి : హరీశ్రావు
Sigachi Industries | సిగాచి కెమికల్స్లో పేలిన రియాక్టర్.. ఎనిమిది మంది కార్మికులు మృతి
Sigachi Industries | పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు