సంగారెడ్డి: పఠాన్చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలో (Pashamylaram Industrial Park) భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ (Reactor Blast)పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. వారిని దవాఖానకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.