హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బాల్క సుమన్పై చెన్నూరులో నమోదైన కేసుతో పాటు శేరిలింగంపల్లిలో నమోదైన మరో కేసు వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పోలీసులతోపాటు ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. చెన్నూరు ము న్సిపల్ ఎన్నికల సమయంలో సుమన్ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చే సి, ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేశారని పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ న మోదు చేశారు. దీనితోపాటు రాయదుర్గంలోని ఒక విల్లాలో ప్రభుత్వానికి, ఎక్సైజ్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు నిరుడు తనపై నమోదైన మరో కేసును కొట్టేయాలని ఆయన హై కోర్టులో విడివిడిగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. బుధవారం విచారణ జరిపిన జ స్టిస్ కే సుజన.. ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారులకు నోటీసులు ఇచ్చారు. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.
ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారం ఏమైంది ? ; రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఎల్లంపల్లి ప్రాజెక్టుకు విడుదల చేసిన నిధుల నుంచి నిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించలేదని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీ నిపై వివరణ ఇవ్వడంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశి స్తూ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్కు చెందిన రామగిరి నందయ్య సహా 21మంది వేసిన వ్యాజ్యాలపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది డీ అంబేదర్ వాదిస్తూ.. నిర్వాసితులకు రూ.58 కోట్ల పరిహారం చెల్లింపు నిమిత్తం 2011లో ప్రభుత్వం జీవో జారీ చేసినా ఆ మొత్తాన్ని చెల్లించలేదని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి పరిహారం చెల్లించకపోవడం, 2023లో తీసుకొచ్చిన జీవో 320 కింద పరిహారం చెల్లిస్తామని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. నిర్వాసితులకు వడ్డీతో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.