హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్ష ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్తోపాటు తెలుగులో ఇవ్వాలనే ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబరు 9న జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రశ్నపత్రం ఇంగ్లిష్లో ఉంటుందని పేరొనడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్కు చెందిన టీ విజయ్కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. రెండు భాషల్లోనూ ప్రశ్నపత్రం ఉండాలని, ఇంగ్లిష్లో మాత్రమే ఇస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. స్పందించిన కమిషన్ తరఫు న్యాయవాది రాంగోపాల్రావు కమిషన్ వైఖరి తెలుసుకొని చెప్పేందుకు వారం గడువు కావాలనడంతో హైకోర్టు విచారణను మార్చి 12కి వాయిదా వేసింది.