హైదరాబాద్, మార్చి29 (నమస్తే తెలంగాణ) : కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను ముద్రించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబే దర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్ హౌస్లో ఉప రాష్ట్రపతికి వారు వినతిపత్రం అందజేశారు.
కరెన్సీపై అంబేద ర్ ఫొటో ముద్రించేందుకు ఈ పార్లమెంటు సమా వేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం ఇదే డిమాండ్తో ఈ నెల 31న న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన మహాధర్నా కరపత్రాన్ని ఎంపీలు పసునూరి దయాకర్, రాములుకు అందజేశారు. వీరి వెంట సమితి నాయకులు బానోత్ రవి, వరికుప్పల భాషయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు.