
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా టీవీ నటి శ్రీవాణి జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్రీ వాణి మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. వృక్షాలు లేకుంటే మానవ మనుగడ అసాధ్యమన్నారు.

ప్రకృతి పరిరక్షణకు అందరు పాటుపడాలన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని శ్రీవాణి కోరారు. అనంతరం టీవీ ఆర్టిస్ట్స్ నవీన, హిమజ, శివజ్యోతి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.
