హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): మే 2 నుంచి రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఫిజికల్ వెరిఫికేషన్కు తగిన విధంగా ధాన్యం స్టాక్ పెట్టే వరకు ఆయా మిల్లుల బియ్యాన్ని సేకరించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎఫ్సీఐ రీజినల్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 2320 మిల్లుల్లో 62మంది అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మే 1 సాయంత్రం వరకు ఆయా జిల్లాల డీఎంలకు రిపోర్ట్ చేయాలని ఎఫ్సీఐ ఆదేశించింది.