హైదరాబాద్ : పత్తి, ఎండుమిర్చితో తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ చిత్రం పలువురిని ఆకట్టుకున్నది. రైతుబంధు సంబురాలు సందర్భంగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో వినూత్నంగా సీఎం ఎండు మిర్చి, పత్తితో సీఎం కేసీఆర్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. స్థానిక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సూచన మేరకు తల్లాడ సొసైటీ కార్యాలయం వద్ద 320 అడుగులు విస్తీర్ణంలో ఒక క్వింటా ఎండు మిర్చి.. మరో అర క్వింటాల్ పత్తితో రైతులు ఆధ్వర్యంలో చిత్రకారుడు కేసీఆర్ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దారు. సొసైటీ కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావు తిలకించి.. ఎమ్మెల్యే సండ్రను సన్మానించారు.