నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ దవాఖానలో పీజీ స్టూడెంట్ (PG student) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత.. గైనకాలజీ పీజీ సెకండియర్ చదువుతున్నది. ఈ క్రమంలో గురువారం రాత్రి జిల్లా కేంద్ర దవాఖానలో డ్యూటీ చేసింది. మూడు గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న రెస్ట్ రూమ్లో పడుకున్నది. ఉదయం తోటి సిబ్బంది చూసే సరికి కనిపించకపోవడంతో అంతా వెతికారు. వాష్రూమ్లో విగత జీవిగా పడి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు దవాఖానకు చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.