BJP | పరకాల, సెప్టెంబర్ 15 : సెప్టెంబర్ 17 నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొం డ జిల్లా పరకాలలో శుక్రవారం నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పట్టణంలోని పశువుల సంతలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను విమర్శిస్తుండగా పలువురు సభనుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు.
ఆ తరువాత కిషన్రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించే సమయానికి సభా ప్రాంగణం చాలావరకు ఖాళీ అయ్యింది. దీంతో ఆయన ఖాళీ కుర్చీలతోనే తన ప్రసంగాన్ని ముగించారు. కాగా సభ నిర్వహణకు సరైన ప్రణాళిక లేకపోవడం, ఓ వర్గం నాయకులు ఒంటెత్తు పోకడల వల్లనే సభ ఫ్లాప్ అయ్యిందని మరో వర్గం నాయకులు పేర్కొనడం గమనార్హం.