మహబూబ్ నగర్, అక్టోబర్ 22 : దయచేసి చెప్తున్నాం..మా కాలనీకి బీఆర్ఎస్ పార్టీ తప్పా మరే పార్టీ నేతలు రావద్దని, ఇక్కడ వేరే పార్టీకి చోటే లేదని.. తామంతా కారు గుర్తుకే ఓటేస్తామని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేటీఆర్ నగర్ (డబుల్ బెడ్రూం కాలనీ) వాసులు తీర్మానించారు. ఈ మేరకు వారంతా కాలనీలో ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధికి పట్టం కట్టేందుకు కాలనీ వాసులంతా ఒకేమాటపై నిలుస్తున్నామని వెల్లడించారు. కలలో కూడా ఊహించని విధంగా మహబ్నగర్ను అభివృద్ధి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud)ను మరోసారి గెలిపించుకుంటామని, ఈసారి లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
తమ కాలనీలో వేరే పార్టీలకు, ఆయా పార్టీ నేతలకు చోటే లేదని కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ తమ కాలనీకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.శివరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, తదితరులు పాల్గొన్నారు.