వరంగల్ : ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సీఎం కేసీఆర్ గెలువడ ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy) అన్నారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ పరిధిలోని పోతరాజుపల్లి గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో అందించారని, మరోసారి కూడా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొన్న కష్టాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. తెలంగాణ వెనుకబడటానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తెలంగాణను మోసం చేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.