భారీగా చేరుతున్న ఇతర పార్టీల నాయకులు
హుజూరాబాద్ రూరల్/జమ్మికుంట రూరల్/ఇల్లందకుంట, అక్టోబర్ 1: హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ జోరు కొనసాగుతున్నది. ఏడున్నరేండ్ల ప్రగతిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల వారు, ఇతరులు పెద్ద సంఖ్య లో టీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ గెస్ట్హౌస్లో మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకుడు సమ్మయ్య, ప్రభాకర్ టీఆర్ఎస్లో చేరగా, మంత్రి హరీశ్రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జమ్మికుంటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో మాజీ సర్పంచ్ కట్కూరి యుగేందర్రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇల్లందకుంటలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీజేపీ నాయకులు రేణికుంట్ల రవీందర్, దేవేందర్, రామస్వామి, దుర్గయ్య, శివకుమార్, రాజు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నాయకుడు దర్గుల రాకేష్ ఆధ్వర్యంలో ఇల్లందకుంట మండల బీజేవైఎం అధ్యక్షుడు గుత్తికొండ పవన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోగం హరికృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షుడు గురిజల ప్రవీణ్ టీఆర్ఎస్లో చేరారు. జమ్మికుంట మండలం గోపాల్పూర్ యువత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు.