హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : చలికాలం నుంచి ఒక్కసారిగా పెరిగిపోయిన పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రజలు ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించింది. బంగాళాఖాతంలో ఈశాన్యం నుంచి వాయుగుండం ఏర్పడటం, తేమ కారణం వల్ల రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. తూర్పు తెలంగాణలో ఈ నెల 24 నుంచి 26 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉన్నది తెలిపింది. కాగా, హైదరాబాద్లో కొన్ని వారాలుగా వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.