ఆదిలాబాద్: పెన్గంగలో (Penganga) వరద ఉధృతి కొనసాగుతున్నది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనాథ్ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నది. దీంతో బ్రిడ్జిపై నుంచి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బ్రిడ్జికి ఇరువైపుల 25 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు బారులుతీరాయి. అయితే పెన్గంగ ఉధృతిని పీడీ శ్రీనివాస్ నేతృత్వంలోని నేషనల్ హైవేస్ అథారిటీ (NHA) అధికారుల బృందం పరిశీలించింది. వరద ప్రవాహం కాస్త నెమ్మదించడంతో బ్రిడ్జిపై నుంచి ఒక్కొక్క వాహనానికి అనుమతిస్తున్నారు.