హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : సర్జికల్, డయాగ్నోస్టిక్స్, ఎక్విప్మెంట్కు సంబంధించి ఏడాది గా పెండింగ్లో ఉన్న రూ.245 కోట్లు వెంటనే విడుదల చేయాలని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సైప్లెర్స్ అసోసియేషన్ ప్రతినిధులు టీజీఎంఎస్ఐడీసీ ఎండీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీలకు ఎక్విప్మెంట్ను సరఫరా చేయాలని టీజీఎంఎస్ఐడీసీ కోరగా సరఫరా చేసినట్టు వెల్లడించారు. కొన్ని చోట్ల బిల్డింగ్లు సిద్ధంకాని కారణం గా.. మరికొన్నిచోట్ల స్పెషలిస్టు వైద్యు లు లేని కారణంగా ఏడాదిగా వినియోగంలో లేకుండా మూలన పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని ఎక్విప్మెంట్లకు వారంటీ గడువు ముగిసినట్టు వాపోయారు. దవాఖానల నిర్వహణ సజావుగా సాగేందుకు బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.