Pen Ganga | నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహాక ప్రాంతాలు వరదలతో పోటెత్తుతున్నాయి. గోదావరి ఉప నదులు ప్రాణహిత, పెన్గంగ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పెన్గంగ మహోగ్రరూపం దాల్చింది. జైనథ్ మండలంలోని డోలారా వద్ద పెన్గంగ మహోగ్రరూపం దాల్చింది.
పెన్ గంగ వరద నీరు 50 అడుగులు ఎత్తున ఉన్న వంతెనను తాకాయి. దీంతో 44వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ఉద్రుతి తగ్గిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పునరుద్ధరిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు చెప్పారు. మరోవైపు, గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తుతున్నది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతున్నది.