జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామ అంబాలకుంట చెరువులో సోమవారం కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన (ఖడ్గాన్ని పోలిన) విగ్రహం బయటపడింది.
గతంలో నాగదేవత, వినాయకుడి విగ్రహం బయటపడగా ప్రస్తుతం అవి కనిపించడం లేదు. అక్కడ తవ్వితే ఇంకా విగ్రహాలు వెలుగు చూసే అవకాశం ఉన్నదని స్థానికులు అంటున్నారు.
– టేకుమట్ల