సూర్యాపేట : దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి( MLA Jagadish Reddy) అన్నారు. నియో జకవర్గంలోని పెన్ పహహాడ్ మండలం మాచవరం గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ సీతా రామచం ద్రస్వామి ఆలయ 16 రోజుల పండుగ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ రాబోయే కాలం అంతా మంచే జరుగుతుందన్న ఆశావాద దృక్పథం అలవడుతుందన్నారు.
ధ్యానంలో మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతనను దైనందిన జీవితంలో భాగముగా చేసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పెన్పహాడ్ జెడ్పీటీసీ మామిడి అనిత, మండలాధ్యక్షులు దొంగరి యుగంధర్, బొబ్బయ్య, బిట్టు నాగేశ్వరరావు, చీదేళ్ల ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.