హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పోడు పట్టాలు అందుకున్న గిరిజనులపై ఉన్న ఆక్రమణ కేసుల ఎత్తివేత ప్రక్రియను అటవీశాఖ చేపడుతున్నది. జిల్లాల వారీగా ఇప్పటి వరకు తొలగించిన కేసుల వివరాలను తక్షణమే అందించాలని డీఎఫ్వోలకు పీసీసీఎఫ్, అటవీ దళాల అధిపతి డోబ్రియాల్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులపై 1,917 కేసులు నమోదు అయ్యాయి. న్యాయస్థానం సూచనల మేరకు వచ్చే 20 రోజుల్లో కేసులను తొలగించనున్నారు. అత్యధికంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.