హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్ ను పేల్చాలన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శాసనసభ మీడియా పాయింట్లో సుదర్శన్రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి, జానారెడ్డి సమర్థిస్తారా?అని ప్రశ్నించారు.ప్రగతి భవన్ను పేల్చాలన్న రేవంత్పై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని, ఈ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
మహాత్మా గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా? అని దుయ్యబట్టారు. ఛత్తీస్ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ప్రభుత్వ ఆఫీస్ లని పేల్చాలని డిమాండ్ చేస్తారా?అని నిలదీశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి క్రిమినల్ మాదిరిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే ,రేవంత్ తోడో యాత్ర అంటున్నారని విమర్శించారు.
ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పీసీసీ అధ్యక్షుడు సంఘ విద్రోహ శక్తులా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మావోయిస్టులను రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారా ?మావోయిస్టుల పై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటి ? విధ్వంసమే విధానం అని చెబుతారా ?పేల్చేయడం…కుల్చేయడం అసాంఘిక శక్తుల మాట్లాడే మాటలని పేర్కొన్నారు.