రామగుండం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్లో (RFCL) ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణ నిబంధనలు పాటించలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ వల్ల కొన్నాళ్లుగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్.. పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తనిఖీలు చేసిన అధికారులు రూ.12 లక్షల గ్యారంటీ సొమ్మును జప్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పరిశ్రమలో యూరియా ఉత్పత్తిని ఆపేయాలని ఆదేశాలు జారీచేసింది.