KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. బీఆర్ఎస్ అధినేత సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి గాయమైందని తెలిసి బాధపడ్డాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్.. ఈ అనారోగ్య పరిస్థితుల్ని కూడా మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నా’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ ప్రకటన విడుదల చేశారు.
శ్రీ కేసీఆర్ గారు సంపూర్ణంగా కోలుకోవాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/59kXk83p3V
— JanaSena Party (@JanaSenaParty) December 8, 2023
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) గురువారం అర్థరాత్రి కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు వెల్లడించారు.
Also Read..
“KCR | కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు”
“PM Modi | కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ ట్వీట్”
“KCR | కేసీఆర్ కాలికి గాయం.. త్వరలోనే కోలుకుంటారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్”