పటాన్చెరు, జూలై 27: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి(35) అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగురోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని కాంటినెంటల్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున విష్ణువర్ధన్రెడ్డి మరణించారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దవాఖానకు వెళ్లి ఎమ్మెల్యే, కు టుంబ సభ్యులను పరామర్శించారు. విష్ణుకు భార్య కిరణ్మ యి, బాబు, పాప ఉన్నారు. పటాన్చెరులో నిర్వహించిన అంత్యక్రియల్లో మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, టీఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, క్రాంతికిరణ్, మదన్రెడ్డి, మాణిక్రావు, పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.