పటాన్చెరు, జనవరి 13: విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమైన పటాన్చెరు సీఐ లాలూనాయక్పై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు ఎస్పీ రూపేశ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత డిసెంబర్ 24వ తేదీ రాత్రి పటాన్చెరు సాకీ చెరువు వద్ద అమీన్పూర్కు చెందిన నాగేశ్వరరావుపై దాడి జరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతడి మృతికి కారణమైనట్టుగా విచారణలో తేలడంతో ఎస్పీ రూపేశ్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీఐ లాలూనాయక్ స్థానంలో ఇన్చార్జి సీఐగా శ్రీనివాస్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.