కొత్తగూడెం క్రైం, జూన్ 5: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు వారిని బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం పట్టణానికి చెందిన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం వారు పట్టణ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత ఘర్షణలను రెచ్చగొట్టేలా ఎంపీ వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. ఆయన వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని నెలకొల్పేలా ఉన్నాయని, ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.