హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25న పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం పాస్పోర్ట్ సేవా కేంద్రాలు వారి కోసం ప్రత్యేక సేవలు అందిస్తాయని, 25వ తేదీ నాటి దరఖాస్తుదారులు ఈ సేవలను వినియోగించుకోవాలని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య గురువారం సూచించారు.
బేగంపేట, అమీర్పేట, టోలిచౌకి పీఎస్కేలతోపాటు నిజామాబాద్, కరీంనగర్లోనూ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే సదరు దరఖాస్తుదారులకు సందేశాలు పంపించామని పేర్కొన్నారు.