హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తేతెలంగాణ) :బస్సులో తీవ్ర అవస్థకు గురైన ప్రయాణికురాలిని సకాలంలో దవాఖానకు తరలించి ఆర్టీసీ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్-కల్వకుర్తి రూట్ బస్సులో ఆదివారం నందిని అనే మహిళ ప్రయాణిస్తుండగా..తుక్కుగూడ సమీపంలోకి వచ్చాక ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. గమనించిన కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ.. డ్రైవర్ అంజయ్యను అప్రమత్తం చేశారు. బస్సును ఆపించి అంబులెన్స్కి సమాచారం ఇచ్చారు.
అంబులెన్స్లో ఆమెని కడ్తాల్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకున్న కండక్టర్ శశికళ, డ్రైవర్ అంజయ్యను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశింసించారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలందించడంతో పాటు మానవత్వం చాటుకోవడంలోనూ తక్కువ కాదని ఆర్టీసీ సిబ్బంది నిరూపిస్తుండడం సంతోషదాయకమని ఆదివారం ఎక్స్ వేదికగా ఎండీ వెల్లడించారు.