హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని కోయంబత్తూర్లో ఆదియోగి సమక్షంలో ఫిబ్రవరి 18న జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు రావాలని ఎంపీ సంతోష్కుమార్కు ఈషా ఫౌండేషన్ ఆహ్వానం పంపింది. ఈషా యోగా సెంటర్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కోట్ల మంది ప్రజలు ఆన్లైన్లో వీక్షిస్తారు. లక్షల మంది ప్రత్యక్షంగా హాజరయ్యే ఈ మహా వేడుకలను కనులారా తిలకించాలని కోరింది. తనకు అందిన ఆహ్వానాన్ని ఎంపీ సంతోష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆదియోగి సమక్షంలో జరిగే అద్భుతమైన వేడుకలను చూసేందుకు తనకు అవకాశం కల్పించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈషా ఫౌండేషన్కు, సద్గురుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది నిర్వహించిన వేడుకలను 14 కోట్ల మంది ఆన్లైన్లో వీక్షించారు.