పరిగి, అక్టోబర్ 30: గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పరిగిలో మీడియాతో మాట్లాడారు. నందకుమార్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ఆయనతో పరిచయం లేదని, కలిసిన, ఫోన్లో మాట్లాడిన సందర్భాలూ లేవన్నారు. కావాలంటే తన ఫోన్ కాల్ డాటాను పరిశీలించుకోవచ్చని సూచించారు. తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యల కోసం ఫిర్యాదు చేస్తానన్నారు. మునుగోడులో బీజేపీ ఓడిపోతుందని, అందువల్లే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభను రద్దు చేసుకున్నారన్నారు.