Minister Harish Rao | సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమనికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పరకాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్కు చెందిన వైస్ ఎంపీపీ, సర్పంచ్, మాజీ సర్పంచ్తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే చల్లారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దేశంలోనే నెంబర్ వన్గా నిలిపారని కొనియాడారు.
సీఎం కేసీఆర్ విధివిధానాలకు ఆకర్షితులమై తాము బీఆర్ఎస్లో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో గీసుకొండ వైస్ ఎంపీపీ రడం శ్రావ్య భరత్, రాంపూర్ సర్పంచ్ గాజర్ల గోపి, మచ్చాపూర్ మాజీ సర్పంచ్ నమిండ్ల మానస, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొలబోయిన గోవర్ధన్, పొలబోయిన శ్రీనివాస్, కందికొండ రాజు, ఇట్టారి గురువయ్య, యూత్ లీడర్లు పొలెబోయిన సంపత్, గాజర్ల రంజిత్, పేర్ల శ్రవణ్, మంద అనిల్, పులి నాగేశ్, దండబోయిన సుమన్, పొలెబోయిన రాము తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.