హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న పండిట్లు, పీఈటీల అప్గ్రేడేషన్ను పూర్తిచేసి, పదోన్నతులు కల్పించాలని టీఎస్పీఆర్టీయూ ప్ర భుత్వాన్ని కోరింది. అప్గ్రేడేషన్పై హైకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో తా జా పదోన్నతుల షెడ్యూల్లోనే వీరికీ పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేర కు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, మాజీ ప్రధా న కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి శనివా రం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు.