వరంగల్, డిసెంబర్ 16 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): సర్కా రు దవాఖానల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు మెరుగుపడినట్టు చెప్పారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 80 నుంచి 90 శాతం వరకు నార్మల్ డెలివరీలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవఖాన (జీఎంహెచ్)లో ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆర్మూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రాచర్ల షాలినిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయభాసర్ శుక్రవారం అభినందించారు.